manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 4:32 pm Editor : manabharath

పిప్రిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన..

మన భారత్, బజార్ హత్నూర్:

ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. సభా స్థలంలో జరుగుతున్న పనులను సవివరంగా పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలని, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ, ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ విజయవంతం కావాలని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.