మన భారత్ , తెలంగాణ:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు ఎగబాకినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,49,290కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,36,850గా నమోదైంది.

ఇదిలా ఉండగా, వెండి ధరలో మాత్రం గణనీయమైన పడిపోవడం కనిపించింది. కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,50,000కు చేరింది. మార్కెట్ నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, అలాగే డిమాండ్-సప్లై ప్రభావంతో ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.
