ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి.!
మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు స్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పిడిఎస్యు మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడడం సమాజం తలదించుకునే...