పంటలకు తీవ్ర నష్టం.. రైతుల ఆందోళన
కామారెడ్డి, మన భారత్: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వాన రైతులకు పెద్ద దెబ్బతీసింది. ముఖ్యంగా పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో ఆకస్మికంగా కురిసిన వడగళ్ల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. చేతికి అందిన పంటలు ఒక్కసారిగా నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొట్ట దశలో ఉన్న వరి గింజలు వడగళ్ల ప్రభావంతో పగిలిపోవడంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం...