విద్యార్థిని మృతి కేసులో మలుపు.. రీ-పోస్ట్మార్టం
మన భారత్, తాంసి: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని లిఖిత మృతదేహానికి మంగళవారం రీ-పోస్ట్మార్టం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మూడు నెలల క్రితం, డిసెంబర్ 8న అస్వస్థతకు గురైన లిఖితను తొలుత స్థానికంగా చికిత్స అందించి అనంతరం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి...