రాజధాని డిజైన్లపై రూ.401 కోట్లు ఖర్చా.?
మన భారత్, ఆంధ్రప్రదేశ్/అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ఖర్చుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ భవనాల డిజైన్ల పేరుతో భారీ మొత్తంలో ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారని, ఇందులో అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. YCP ఆరోపణల ప్రకారం, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల కోసం దాదాపు రూ.401 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కేవలం డిజైన్ పనులకే ఇంత భారీ...