రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ.!
మన భారత్, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ్యాస్ కొరత సమస్య తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి అర్హుడైన రేషన్ కార్డు దారుకు లీటర్ చొప్పున కిరోసిన్ అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు 2,800 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించిన విషయం తెలిసిందే. (ఒక కిలోలీటర్ =...