మన భారత్, తలమడుగు, మార్చి 21:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ & కామర్స్ విభాగంలో ఈ నెల 26వ తేదీ (గురువారం) ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి ప్రిన్సిపాల్ రఘు గణపతి తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలకు 2020 నుండి 2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు ₹14,000 నుండి ₹18,000 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ఆదిలాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెస్యూమ్, ఆధార్ కార్డు తీసుకొని ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని సూచించారు.

మరిన్ని వివరాలకు TSKC కో-ఆర్డినేటర్ అనిత పవార్, మెంటర్ చైతన్యను 9885762227 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యం పిలుపునిచ్చింది.
