గిరిజనులను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ గిరిజన సంఘం తీవ్ర స్థాయిలో విమర్శించింది. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం. ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ సంయుక్త ప్రకటనలో ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, మూడో ఏడాది బడ్జెట్లో కూడా వాటికి తగిన నిధులు...