రైతు భరోసాకు దరఖాస్తు చేశారా.?
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పొందేందుకు ఈనెల 25వ తేదీలోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా తమ వివరాలను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా నిధుల జమకు సంబంధించిన వివరాలలో మార్పులు చేయాలనుకునే రైతులు ఈనెల 21వ తేదీ వరకు సవరణలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఆధార్...