మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:
మన భారత్, ఇంటర్ నేషనల్ డెస్క్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఖతర్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ (LNG) ఉత్పత్తి కేంద్రం రాస్ లఫాన్పై ఇరాన్ దాడి చేయడం అంతర్జాతీయంగా ఆందోళనలకు దారితీసింది. ఈ పరిణామం భారత్పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్ తన అవసరాల కోసం వినియోగించే ఎల్ఎన్జీలో సుమారు 50 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో దాదాపు 40 శాతం వాటా ఖతర్ నుంచే రావడం గమనార్హం. ఇలాంటి సమయంలో రాస్ లఫాన్ ప్లాంట్పై దాడి జరగడం సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా నేచురల్ గ్యాస్ దిగుమతుల్లో కొంతమేర అంతరాయం ఏర్పడింది. తాజా దాడితో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల భారత్లో పారిశ్రామిక రంగం, విద్యుత్ ఉత్పత్తి రంగం వంటి కీలక విభాగాల్లో గ్యాస్ వినియోగాన్ని పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

అలాగే గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితులను సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అవసరమైతే ఇతర దేశాల నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు పెంచే దిశగా చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. అంతర్జాతీయ పరిణామాలపై భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Qatar LNG Attack, India Gas Supply, LNG Import India, Iran Qatar Conflict, Natural Gas Crisis, Energy Security India, Global Energy News, Mana Bharath News
