రేవంత్ రెడ్డికి శుభ సంకేతాలు.!
మన భారత్, తెలంగాణ: నూతన సంవత్సరంలో వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయని, రైతులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ప్రముఖ పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి మేలు జరిగే సూచనలు ఉన్నాయని, రైతులు సంతోషంగా ఉంటారని ఆయన విశ్లేషించారు. పంచాంగ శ్రవణంలో భాగంగా మాట్లాడిన ఆయన, వర్షపాతం అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపు వంటి...