manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 9:06 am Editor : manabharath

నీటి ఎద్దడి నివారణకు చర్యలు.!

మన భారత్, భీంపూర్:

వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 5వ వార్డులోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల సమీపంలో కొత్త బోరు ఏర్పాటు చేయించారు.

సుమారు రూ.50 వేల వ్యయంతో తవ్వించిన ఈ బోరులో సమృద్ధిగా నీరు లభించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చకుండా ముందస్తు చర్యలుగా ఈ బోరు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ బోరు వద్ద చేతి పంపు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల అవసరాల దృష్ట్యా ఇటువంటి పనులను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

స్థానికులు సర్పంచ్ చర్యలను అభినందిస్తూ, తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.