manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 4:04 am Editor : manabharath

తిరుమల చారిటబుల్ సేవలు మరువలేనివి..

మన భారత్, తలమడుగు:

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు బండ అనిల్ కుమార్ నేతృత్వంలో రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు, అవసరమైన వారికి ఉచిత భోజనం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉగాది పండుగ సేవా భావాన్ని మరింత పెంపొందించే సందర్భంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అత్యున్నత దానం అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుర్ర నరేష్, బండ మల్లికార్జున్, సామల రవి మణి, అనుముల ఉదయ్ కిరణ్, బండ అవినాష్, మాధస్తు శంకర్, రాజు యాదవ్, బండారి నరేష్, చావరియ సాయి కిరణ్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజల నుండి మంచి స్పందన లభించగా, ఈ కార్యక్రమం సామాజిక సేవకు ఆదర్శంగా నిలిచింది. పండుగ వేళ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సహానుభూతి, పరస్పర సహకారం పెంపొందించేందుకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.