నిమిషంలో 83 పదాలు చదివిన ‘ప్రసిద్ధి’..
మన భారత్, తాంసి: తాంసి మండలంలోని పొన్నారి ప్రాథమిక పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థిని ప్రసిద్ధి తన అద్భుత ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు సబ్జెక్టులో ఒక్క నిమిషంలో 83 పదాలను తప్పులు లేకుండా స్పష్టంగా చదివి ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించింది. పాఠశాలలో నిర్వహించిన చదువు పరీక్షల సందర్భంగా ప్రసిద్ధి ఈ ప్రతిభను చూపగా, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఈ స్థాయి పఠన నైపుణ్యాన్ని ప్రదర్శించడం అభినందనీయమని ఉపాధ్యాయులు...