కాంగ్రెస్ పై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం..
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు సరైన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ తీవ్రంగా విమర్శించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మెజార్టీ గా ఉన్న మాదిగ సమాజాన్ని రాజకీయంగా అణచివేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా...