manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 7:54 am Editor : manabharath

గవర్నమెంట్ జాబ్.. ఒక్క రోజే అవకాశం.!

మన భారత్ , జాబ్స్:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కీలక అవకాశం అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో గ్రూప్-D కేటగిరీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మొత్తం 22,195 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, ఆన్లైన్ అప్లికేషన్‌కు రేపటితో గడువు ముగియనుంది.

ఈ నియామకాలను Railway Recruitment Boards నిర్వహిస్తున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 రాత్రి 11.59 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గడువు తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదో తరగతి (10th Class) లేదా ఐటీఐ అర్హత కలిగి ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా పలు కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా పాయింట్స్మన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ ఆపరేషన్స్, ఇతర సాంకేతిక మరియు సహాయక పోస్టులు ఉన్నాయి.

సౌత్ సెంట్రల్ రైల్వేలో పోస్టులు:
South Central Railway పరిధిలోనే 1,012 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది.

ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ పూర్తి అవుతుంది.

ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు 

వెబ్‌సైట్:
hthttps://www.rrbapply.gov.in/

రైల్వేలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే యువత ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.