నాడు కూలీ.. నేడు DSP.. రేపు UPSC అధికారి
మన భారత్ , తెలంగాణ: పేదరికం, కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు ఎన్ని వచ్చినా సంకల్పం బలంగా ఉంటే విజయాన్ని సాధించవచ్చని మరోసారి నిరూపించారు ములుగు జిల్లాకు చెందిన యువకుడు దైనంపల్లి ప్రవీణ్ కుమార్. తల్లిదండ్రులు లేకపోయినా నానమ్మ కూలీ పనులు చేస్తూ చదివించిన కష్టాన్ని ఆయన వృథా కానివ్వకుండా కృషితో గెలుపు తీరానికి చేరుకున్నారు. ములుగు జిల్లాలోని సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రవీణ్ కుమార్ చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తల్లిదండ్రుల ఆదరణ లేకపోవడంతో...