manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 7:43 am Editor : manabharath

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌..

మన భారత్, ఆరోగ్యం:

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న నిషేధ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులను సోషల్ మీడియా తప్పుదారి పట్టిస్తోందని, అందుకే దీనిపై కట్టడి అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న సోషల్ మీడియా నియంత్రణ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా విద్యకు సంబంధించిన ఎన్నో మంచి విషయాలు, సమాచారాన్ని తెలుసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు మాత్రం అవగాహన లేకుండా తప్పుదారి పట్టించే వీడియోలు, వినోదాత్మక కంటెంట్ వైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల చదువుపై దృష్టి తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.

పిల్లలు రోజుకు గంటల కొద్దీ మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఇక పిల్లలు చదువుపై దృష్టి పెట్టి తమ లక్ష్యాలను సాధించాలంటే సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అవసరమా అనే అంశంపై నెటిజన్లు చర్చిస్తున్నారు.