Dharaviలో స్లమ్ టూరిజం హాట్టాపిక్..
మన భారత్, ముంబై: ఆర్థిక రాజధాని Mumbaiలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారవి ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. సాధారణంగా పేదరికం, ఇరుకైన వీధులు, గూడిసెలతో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇప్పుడు “స్లమ్ టూరిజం” పేరుతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా విదేశీ పర్యాటకులు ధారవిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని టూర్ నిర్వాహకులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం, ధారవిలోని జీవనశైలి, స్థానికుల దైనందిన కార్యకలాపాలు, అక్కడ నడుస్తున్న చిన్నతరహా కుటీర పరిశ్రమలను చూపించేందుకు...