manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 12:19 pm Editor : manabharath

ఇచ్చొడలో విషాదం.. బీఆర్ఎస్ నేత సోదరుడి మృతి

మన భారత్, ఆదిలాబాద్: 

ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భూషణ్ సోదరుడు అంజి నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్పునిచ్చారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

ఈ పరామర్శలో మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, పాండురంగ్, రమేష్, దేవేందర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కుటుంబానికి సానుభూతి తెలిపారు.

గ్రామంలో అంజి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని స్థానికులు పేర్కొన్నారు.