ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు! వయనాడ్ బాధితులకు ఆశాకిరణం
మన భారత్ కేరళ,: ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేసిన విషాద ఘటన తర్వాత కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొచ్చింది. కొండచరియలు కూలిన దుర్ఘటనలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల కోసం ఆధునిక సదుపాయాలతో అద్భుతమైన టౌన్షిప్ను నిర్మించి కొత్త జీవితం ప్రారంభించేందుకు అవకాశం కల్పించింది. వయనాడ్లో ఆధునిక టౌన్షిప్ ప్రారంభం వయనాడ్ జిల్లాలోని ముండక్కై-చూరల్మల ప్రాంతాల్లో జరిగిన భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో అనేక కుటుంబాలు నివాసాలు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో బాధితుల పునరావాసం కోసం...