తెలంగాణలో 45 మంది ఐఏఎస్ల బదిలీ..
మన భారత్ తెలంగాణ ,హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ల స్థాయిలో విస్తృత మార్పులు చేయడంతో పాటు కీలక శాఖల్లోనూ ఉన్నతాధికారుల నియామకాలు జరిగాయి. పరిపాలనా అవసరాలు, సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడం ద్వారా జిల్లా స్థాయి పాలనలో కొత్త...