మారిన మనుషులు.. దోస్త్ లే వద్దు.!
ఫ్రెండ్షిప్ రిసెషన్’ ముప్పు.. ఒంటరితనంలోకి జారుతున్న సమాజం మన భారత్, సంపాదకీయం: వేగంగా మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ ప్రభావం, స్మార్ట్ఫోన్ల ఆధిపత్యం కారణంగా మనుషుల మధ్య బంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబ బంధాలతో పాటు స్నేహాలు కూడా జీవితంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. వందల నుంచి ఒక్కరికి తగ్గిన స్నేహాలు 1960ల కాలంలో ఒక్కో వ్యక్తికి సగటున వందమందికి పైగా...