manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 11:08 pm Editor : manabharath

జిల్లా జైలులో బాల్క సుమన్ పరామర్శ… అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు

మన భారత్ తెలంగాణా: 

ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా పాల్గొన్నారు.

జిల్లా జైలులో బాల్క సుమన్‌ను కలిసిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పార్టీ నేతలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు సరికాదని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రాజకీయ విభేదాల కారణంగా నాయకులపై చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. ప్రజల మద్దతు ఉన్న నాయకులను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్యే, కోవ లక్ష్మి కూడా మాట్లాడారు. బాల్క సుమన్ ఆరోగ్యం, పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నామని, ఆయనకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

జిల్లా జైలు పరిసరాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి మద్దతు తెలిపారు. ఈ పరామర్శ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.