manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 7:18 am Editor : manabharath

మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ ప్రకటింపు?

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే నెల తొలి వారంలో శుభముహూర్తం చూసుకొని అధికారికంగా పార్టీని ప్రకటిస్తానని తెలిపారు.

పార్టీ పేరులో “తెలంగాణ” పదం తప్పక ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఆత్మగౌరవం, ప్రాంతీయ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కొత్త రాజకీయ వేదికను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పారు. మొదటి ప్రాధాన్యతగా సిద్దిపేట నియోజకవర్గాన్ని, రెండో ఎంపికగా బోధన్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

రాజకీయ వర్గాల్లో ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.