manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 4:32 am Editor : manabharath

‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

మన భారత్, హైదరాబాద్:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన తాజా చిత్రం ‘వారణాసి’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలుస్తుందని ఆమె వెల్లడించారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజన్ ప్రత్యేకమని, ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. “నా కెరీర్‌పై ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం” అని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాజమౌళి శైలిలో విజువల్ వండర్‌గా ఈ చిత్రం నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.