manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 1:30 pm Editor : manabharath

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్:

పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రమాదాలను నివారించే ఉద్దేశ్యంతో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమని వెల్లడించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం స్థానిక మావల వైపు నుండి వచ్చే వాహనాలు తిరుమల పెట్రోల్ బంక్ వరకు, అలాగే రైల్వే స్టేషన్ వరకు, ఆర్టీవో కార్యాలయం రైల్వే గేటు నుండి ‘ఐ లవ్ ఆదిలాబాద్’ వరకు పట్టణ పరిధిలో పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు.

ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.