ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కళాల శ్రీనివాస్ సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి నగేష్పై 323 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినా, తుది ఫలితంలో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఎన్నికల అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఆయన అనుచరులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు అభివృద్ధి, సేవాభావాన్ని గుర్తించి తనకు మద్దతు ఇచ్చారని శ్రీనివాస్ పేర్కొన్నారు. 43వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం విశేషంగా భావిస్తున్నారు.