manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 12:00 am Editor : manabharath

ఆదిలాబాద్ 5వ వార్డులో బీజేపీ ఘన విజయం..497 ఓట్ల భారీ మెజారిటీతో ధోని జ్యోతి గెలుపు

మన భారత్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 5వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ధోని జ్యోతి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆమెకు మొత్తం 1067 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థి అలాల పుష్పకు 570 ఓట్లు దక్కాయి.

దీంతో ధోని జ్యోతి 497 ఓట్ల భారీ మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

స్థానిక సమస్యల పరిష్కారం, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ధోని జ్యోతి తెలిపారు. ప్రజలు అభివృద్ధికి ఓటు వేసారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ బలం మరింత పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.