manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 10:50 pm Editor : manabharath

ఆదిలాబాద్ 38వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నగ్మ విజయం – 46 ఓట్ల తేడాతో గెలుపు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 38వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నగ్మ సిద్ధికి సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమెకు మొత్తం 697 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్చన రామ్ కుమారు 651 ఓట్లు సాధించారు. దీంతో 46 ఓట్ల స్వల్ప మెజారిటీతో నగ్మ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

38వ వార్డులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ప్రతి రౌండ్‌లో ఆధిక్యం మారుతూ ఉత్కంఠ రేపగా, చివరికి స్వతంత్ర అభ్యర్థి నగ్మ విజేతగా నిలిచారు. ఫలితాలు వెలువడగానే ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని నగ్మ తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సమస్యలు, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 38వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.