ఆదిలాబాద్ 29వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం .. సుల్తానా ఆధిక్యం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మునవర్ సుల్తానా ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 1032 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి పర్వీన్ భానుకు 916 ఓట్లు వచ్చాయి. దీంతో 116 ఓట్ల మెజారిటీతో మునవర్ సుల్తానా విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 29వ వార్డులో జరిగిన ఈ పోటీ ఆసక్తికరంగా సాగింది. లెక్కింపు ప్రక్రియలో ఆధిక్యం మారుతూ...