ఆదిలాబాద్ 12వ వార్డులో బీజేపీ ఘన విజయం – ఆత్రం సాయికృష్ణ భారీ మెజార్టీ
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 12వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆత్రం సాయికృష్ణ ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆయనకు మొత్తం 1047 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 362 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 12వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి మరింత బలాన్ని చాటిచెప్పింది. భారీ మెజార్టీతో విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో విశేషంగా మారింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు,...