ఆదిలాబాద్ 15వ వార్డులో బీజేపీ విజయం – ఉత్కంఠభరిత పోరులో అశ్విని గెలుపు
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 15వ వార్డులో బీజేపీ అభ్యర్థి అశ్విని మూలే విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం అశ్విని మూలేకు మొత్తం 839 ఓట్లు లభించగా, సమీప ఎంఐఎం (MIM) అభ్యర్థిపై 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 15వ వార్డులో జరిగిన ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. కౌంటింగ్ ప్రక్రియ చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లుగా కొనసాగి, చివరికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించడం విశేషంగా నిలిచింది. ఫలితాలు...