manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 9:10 pm Editor : manabharath

ఆదిలాబాద్ 15వ వార్డులో బీజేపీ విజయం – ఉత్కంఠభరిత పోరులో అశ్విని గెలుపు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 15వ వార్డులో బీజేపీ అభ్యర్థి అశ్విని మూలే విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం అశ్విని మూలేకు మొత్తం 839 ఓట్లు లభించగా, సమీప ఎంఐఎం (MIM) అభ్యర్థిపై 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

15వ వార్డులో జరిగిన ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. కౌంటింగ్ ప్రక్రియ చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లుగా కొనసాగి, చివరికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించడం విశేషంగా నిలిచింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని అశ్విని మూలే తెలిపారు. తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, రహదారుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 15వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.