manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 8:33 pm Editor : manabharath

ఆదిలాబాద్ 32వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ ఫాతిమా విజయం

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో 32వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ ఫాతిమా విజయం సాధించారు. అధికారిక ఫలితాల ప్రకారం ఆమెకు 1,153 ఓట్లు లభించగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సల్మా సుల్తానాకు 985 ఓట్లు వచ్చాయి. దీంతో రోహిణ ఫాతిమా 168 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

32వ వార్డులో జరిగిన ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగగా, చివరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం సాధించడం విశేషంగా మారింది. ఫలితాలు వెల్లడైన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు రోహిణ ఫాతిమాకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని రోహిణ ఫాతిమా పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

ప్రశాంత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 32వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.