ఆదిలాబాద్ 20వ వార్డులో బీజేపీ అభ్యర్థి పద్మవార్ రాకేశ్ ఘన విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పద్మవార్ రాకేశ్ ఘన విజయం సాధించారు. అధికారికంగా విడుదలైన ఫలితాల ప్రకారం ఆయనకు మొత్తం 1032 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మలవార్ చందుకు 517 ఓట్లు వచ్చాయి. దీంతో పద్మవార్ రాకేశ్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఫలితంతో 20వ వార్డులో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. విజయం అనంతరం పద్మవార్ రాకేశ్కు పార్టీ...