manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:41 pm Editor : manabharath

6వ వార్డులో కాంగ్రెస్ విజయం.. బుర్ల నర్మదకు 69 ఓట్ల మెజారిటీ

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బుర్ల నర్మద శంకరయ్య విజయం సాధించారు. కౌంటింగ్ అనంతరం అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు.

వివరాల ప్రకారం బుర్ల నర్మదకు మొత్తం 850 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి జమ్మికుంట శ్రావణికి 781 ఓట్లు లభించాయి. దీంతో 69 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే పోటీ ఉత్కంఠభరితంగా సాగి చివరి రౌండ్ వరకు హోరాహోరీగా కొనసాగింది.

ఫలితం వెలువడగానే కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని విజేత అభ్యర్థి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 6వ వార్డు విజయం కాంగ్రెస్‌కు ఊతమిచ్చింది. మిగిలిన వార్డుల ఫలితాలపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.