ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో కౌంటింగ్ టెన్షన్
మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలలో బుధవారం సాయంత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగింది. వివిధ వార్డులలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అభ్యర్థుల్లో గెలుపు–ఓటములపై ఉత్కంఠ ప్రారంభమైంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో అన్న ప్రశ్నతో అభ్యర్థులు మరియు వారి అనుచరులు లెక్కలు వేసుకుంటూ తుది...