తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం.. సమగ్ర అధ్యయనానికి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరల పెంపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. భూముల మార్కెట్ విలువలను సవరించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలు పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో భూముల విలువలను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, పలు కారణాలతో ప్రభుత్వం ఆ...