బృహత్ ప్రణాళిక ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, కరీంనగర్: వరంగల్–కరీంనగర్ పట్టణాలను జంట నగరాలుగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేయడంతో పాటు, రెండింటిని అనుసంధానం చేస్తూ రహదారులను విస్తరించనున్నట్లు సీఎం వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ.45.15...