manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 8:39 pm Editor : manabharath

రూ.1.80 లక్షల నగదు స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1,80,000 నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నగదు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుండగా, నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న నగదును జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు వినియోగాన్ని అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.