manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 12:55 pm Editor : manabharath

పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

మన భారత్, హైదరాబాద్:

కస్టమర్ వ్యక్తిగత వివరాల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాంకు కస్టమర్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉన్న డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారిన దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

వైరల్ అవుతున్న ఫొటోలో పేరు, నివాస ప్రాంతం, చెల్లింపుల వివరాలు వంటి అత్యంత గోప్యమైన డేటా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటనతో బ్యాంకులు కస్టమర్ డేటా భద్రతను ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగిన బ్యాంకింగ్ సంస్థలు ఈ స్థాయిలో అలసత్వం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Moronhumor అనే పేరుతో ఉన్న X (ట్విట్టర్) అకౌంట్‌లో ఈ ఫొటో షేర్ కావడంతో డేటా ప్రైవసీపై పెద్ద చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలు కస్టమర్ల ఆర్థిక భద్రతకు ముప్పుగా మారతాయని, సైబర్ నేరాలకు దారితీయవచ్చని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంలో డేటా రక్షణ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇలాంటి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కస్టమర్ డేటా భద్రతపై తిరిగి చర్చకు తెరలేపింది.