manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 10:24 am Editor : manabharath

‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

మన భారత్, తెలంగాణ:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుటుంబానికి మరోసారి శుభవార్త రానుందా? అనే చర్చ టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నెల 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఇటీవల జరిగిన సీమంతం వేడుకల సందర్భంగా ఉపాసన చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఆ పోస్టుల్లో కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో ‘మెగా’ ఇంట్లో మరోసారి డబుల్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాగా, 2023 జూన్‌లో రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కుమార్తె క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి శుభవార్త వస్తుందన్న ప్రచారంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మెగా వారసుడు లేదా వారసులు రాబోతున్నారంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ వార్తలపై అధికారిక నిర్ధారణ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.