రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ
మన భారత్ తెలంగాణ
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు బలపడటం, దేశీయంగా డిమాండ్ పెరగడం ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,910 పెరిగి రూ.1,45,690కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,33,550 వద్ద ట్రేడవుతోంది.
ఇదే సమయంలో వెండి ధరలు కూడా భగభగలాడుతున్నాయి. కేజీ వెండి ధర రూ.8,000 పెరిగి మూడు లక్షల రూపాయల మార్క్ను దాటి రికార్డు స్థాయికి చేరింది. ఇటీవల కొన్ని రోజులుగా వెండికి పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు పెట్టుబడిదారుల ఆసక్తి అధికమవడం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్య వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం భవిష్యత్తులో మరింత లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మారకం విలువ, వడ్డీ రేట్లపై ఆధారపడి ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.