మన భారత్, ఆదిలాబాద్:
తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామ పంచాయతీలో శనివారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) సెషన్ను సంబంధిత అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమాలు, మాతా శిశు ఆరోగ్య సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్శనలో హెల్త్ సూపర్వైజర్ రాథోడ్ తులసీరాం పాల్గొని, సెషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. టీకాల పంపిణీ, నమోదు ప్రక్రియ, పిల్లలు మరియు గర్భిణీలకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్త రేఖ సమన్వయంతో యూఐపీ సెషన్ను విజయవంతంగా నిర్వహించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) తాంసి పరిధిలో గ్రామస్తులకు అందుతున్న ఆరోగ్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలకు సమయానికి టీకాలు అందించడం, గర్భిణీలకు అవసరమైన పరీక్షలు చేయడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా సూచించారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఆరోగ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.