కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయానికి నిర్లక్ష్యం: మంత్రి సీతక్క
మన భారత్, రాజన్న సిరిసిల్ల: కేసీఆర్ పాలనలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ భక్తులకు మరింత సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె...