సంక్రాంతి క్రికెట్ టోర్నీ విజేతగా జీవైసీ..
తాంసిలో ఉత్సాహంగా టీపీఎల్ సంక్రాంతి కప్ పోటీలు మన భారత్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. పండుగ వాతావరణంలో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటింది. ఈ పోటీల్లో విద్యానగర్, ఆటో యూనియన్, అంబేద్కర్ యువజన సంఘం, జ్ఞానోదయ యువజన సంఘం (జీవైసి) పేరుతో మొత్తం నాలుగు జట్లు పోటీపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ల...