manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 8:56 am Editor : manabharath

కజ్జర్ల నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం..

డా. రవికిరణ్ యాదవ్ చేతుల మీదుగా అభినందనలు

మన భారత్, తలమడుగు : మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఇటీవల గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన ఎల్మా నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ శాలువా కప్పి సర్పంచ్‌ను సత్కరించారు.

ఈ సందర్భంగా డా. రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచ్ ప్రజల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ, గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సాయి వైకుంఠ ట్రస్ట్ తరపున గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

సన్మాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రవికాంత్ యాదవ్, మట్ట శ్రీనివాస్ యాదవ్, మహేందర్ యాదవ్, ప్రవీణ్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.