manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 6:58 am Editor : manabharath

సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఆహ్వానం..

ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన మౌనీష్ అన్న జన్మదిన వేడుకలకు ఆహ్వానం

మన భారత్, ఆదిలాబాద్:
నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్న మనందరి సేవకుడు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి జన్మదినం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

మౌనీషన్న ప్రజాసేవలో చూపుతున్న నిబద్ధత, అవసరమైన వారికి అండగా నిలిచే తత్వం, సామాజిక బాధ్యతతో చేసే కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆయన జన్మదినాన్ని సాధారణ వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల వేదికగా నిర్వహించాలనే ఉద్దేశంతో శ్రేయోభిలాషులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లోని తిరుమల పెట్రోల్ పంప్ సమీపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాసేవకు అంకితమైన మౌనీషన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని ముడుపు మౌనిష్ రెడ్డి సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

స్థలం:
తిరుమల పెట్రోల్ పంప్,
దస్నాపూర్, ఆదిలాబాద్.